Telangana: కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి క్రాంతి టికెట్ సంపాదించారు!: బాబూ మోహన్ ఆరోపణ

  • తెలంగాణకు దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పారు
  • గెలిచాక తానే ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు
  • టీఆర్ఎస్ భవన్ పై రాళ్లదాడి చేసినవారికే పదవులు

తెలంగాణకు దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూ మోహన్ తెలిపారు. సింగూరు నీటిని కొడుకు కోసం తరలించి పుల్ కల్ ప్రాంత రైతులకు అన్యాయం చేశారని వెల్లడించారు. రాష్ట్రం కోసం పనిచేసిన వారికి కాకుండా వ్యతిరేకులకు టికెట్లు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ పై రాళ్ల దాడి చేసిన క్రాంతికి టీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి క్రాంతి ఆంధోల్ ఎమ్మెల్యే టికెట్ సంపాదించాడని ఆరోపించారు. టీఆర్ఎస్ లో టికెట్లు ఇస్తామన్న 105 మందిలో ఇద్దరికి టికెట్లు ఖరారు చేయలేదనీ, వారిద్దరూ ఎస్సీలేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా సీనియర్‌లను అవమానిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.

More Telugu News