లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై ఒక్క రూపాయి పరువునష్టం దావా వేసిన అలోక్ నాథ్

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై రచయిత్రి, నిర్మాత వింతా నందా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై పరువునష్టం దావా వేశారు అలోక్ నాథ్. తన భార్య అశు నాథ్ తో కలసి వేసిన కేసులో... రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 1 పరిహారంగా చెల్లించాలని అడిగారు.

19 ఏళ్ల క్రితం తనపై అలోక్ నాథ్ అత్యాచారం చేశారని వింతా నందా ఆరోపణలు చేశారు. మీటూ ఉద్యమంలో భాగంగా ఆమె ఈ ఆరోపణలు చేశారు. ఈమె తర్వాత సంధ్య మృదుల్, దీపిక అమీన్ అనే మహిళలు కూడా అతనిపై లైంగిక ఆరోపణలు చేశారు. 
Go Back to Shorts
alok nath
vinta nanda
bollywood

More Telugu News