తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన టీమిండియా.. సెంచరీతో నాటౌట్ గా నిలిచిన జడేజా

రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. 9 వికెట్లకు 649 పరుగులు చేసిన భారత్... తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత ఇన్నింగ్స్ లో పృథ్వీ షా (134), కోహ్లీ (139), జడేజా (100)లు సెంచరీలు సాధించారు. మిడిల్ ఆర్డర్ లో జడేజా సత్తా చాటి 132 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇతర బ్యాట్స్ మెన్లలో పుజారా 86, రహానే 41, పంత్ 92, అశ్విన్ 7, కుల్దీప్ యాదవ్ 12, ఉమేష్ యాదవ్ 22 పరుగులు చేశారు. మొహమ్మద్ షమీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

విండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు, లూయిస్ 2 వికెట్లు పడగొట్టగా... గాబ్రియెల్, ఛేస్, బ్రాత్ వైట్ లు చెరో వికెట్ తీశారు. పుజారా-షాల మధ్య 206 పరుగులు, కోహ్లీ-రహానేల మధ్య 105 పరుగులు, కోహ్లీ-పంత్ ల మధ్య 133 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. బ్రాత్ వైట్, పావెల్ ను ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. తొలి ఓవర్ ను షమీ వేశాడు.
Go Back to Shorts
team india
west indies
test

More Telugu News