చదువుకోసం ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతున్న పిల్లలు!
- అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లాలో ఘటన
- చేతులతో తెడ్డు వేసుకుంటూ వెళుతున్న చిన్నారులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
బిశ్వనాథ్ జిల్లాలోని సూతియా గ్రామానికి చెందిన చిన్నారులు స్కూలుకు వెళ్లడానికి ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఊరికి అవతల ఉండే ప్రాంతంలో స్కూలు ఉండటంతో చేతులతో తెడ్డు వేసుకుంటూ వీరు వాగును దాటుకుంటూ చదువుకోవడానికి వెళుతున్నారు. అధికారులు గ్రామస్తుల కోసం పడవ, వంతెన వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ బోర్దాఖూర్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై తాను సిగ్గుపడుతున్నానని తెలిపారు. పిల్లలు వాగు దాటేందుకు పడవను ఏర్పాటు చేస్తామన్నారు.