నోట్లు పంచకుంటే 'శ్రీరాముడు' పోటీ చేసినా ఓట్లు పడవు!: ఆరెస్సెస్ నేత సంచలన వ్యాఖ్యలు
- రాజకీయాలు డబ్బుమయంగా మారాయి
- యువత, మహిళలే పార్టీలకు కనిపిస్తున్నారు
- బీజేపీ కూడా మిగతా పార్టీల్లాగే తయారయింది
‘ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు జనాభాలో అధికంగా ఉన్న యువత, మహిళలే ముఖ్యం. వీరిని ఆకట్టుకునేందుకు పార్టీలు ఎంత ఖర్చుకయినా వెనుకాడవు. ఇప్పటి రాజకీయాలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకుంటే గెలవడం అన్నది చాలా కష్టం. ఇప్పటి పరిస్థితుల్లో స్వయంగా శ్రీరాముడే దిగొచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా డబ్బులు పంచకుంటే గెలవడం అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన విలువలకు తిలోదకాలు ఇచ్చి మిగతా పార్టీల మాదిరి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
అనారోగ్యం సాకుగా చూపుతూ గోవా సీఎం మనోహర్ పారికర్ ఇటీవల ఇద్దరు మంత్రులను తొలగించారనీ, మరి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ పారికర్ ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. చిన్నచిన్న రోగాలకు సైతం చికిత్స తీసుకునేందుకు రాజకీయ నాయకులు అమెరికా వెళ్లడాన్ని సుభాష్ తప్పుపట్టారు.