ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని తెలిసినా.. కేసీఆర్ బిల్లు పంపారు: అమిత్ షా
- కేసీఆర్ ఎంఐఎంకు భయపడుతున్నారు
- 2018లో అయినా దళితుడిని సీఎం చేస్తారా?
- తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు
2018లో అయినా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? లేదా? అనే విషయాన్ని కేసీఆర్ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని... ఏ ఒక్క జిల్లా అయినా అభివృద్ధి చెందిందా? అని ప్రశ్నించారు. రైతులకు బీజేపీ మద్దతు ధర పెంచితే... కేసీఆర్ సర్కారు రైతులకు సంకెళ్లు వేసిందని విమర్శించారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో దళితులపై దాష్టీకం జరిగిందని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ... ఫెడరల్ స్ఫూర్తికి గౌరవమిచ్చామని, రాష్ట్రాభివృద్ధికి ఎంతో సాయం చేశామని చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో మోదీ సర్కారు ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.