రేపు భారత్ బంద్.. అయినా బ్యాంకులు పనిచేస్తాయంటున్న అధికారులు!
- రేపు మామూలుగా బ్యాంకులు పనిచేస్తాయన్న అధికారులు
- అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక
- బంద్ను విజయవంతం చేయడమే లక్ష్యంగా అడుగులు
సోమవారం యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయని ఉద్యోగుల సంఘం తెలిపింది. అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బ్యాంకు కార్యకలాపాలు సోమవారం మామూలుగానే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ పనిచేయకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఫలితంగా బంద్ను విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను కళ్లకు కట్టాలని చూస్తోంది. ప్రజల పక్షాన నిలిచే పార్టీలన్నీ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చింది. అనుకున్నట్టే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్తో కలిసి నడిచేందుకు ముందుకొచ్చాయి.