Pawan Kalyan: తెలంగాణ శాసనసభ రద్దుపై జనసేన పార్టీలో విస్తృత చర్చ!

  • మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశం
  • బలాబలాలపై బేరీజు
  • శని లేదా ఆదివారం నాడు పార్టీ అధ్యక్షునితో సమావేశం

తెలంగాణ తొలి శాసనసభ రద్దయిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయ పరిణామాలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) సుదీర్ఘంగా చర్చించింది. ఈరోజు హైదరాబాద్.. మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో వివిధ రాజకీయపక్షాలు, రాజకీయ కూటముల బలాబలాలను ప్యాక్ బేరీజు వేసింది. తెలంగాణలో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నివేదిక రూపొందించి పార్టీ అధ్యక్షుడుకి సమర్పించాలని కమిటీ నిర్ణయించింది.

శనివారం లేదా ఆదివారంనాడు పార్టీ అధ్యక్షునితో జరిగే సమావేశంలో ఈ నివేదికపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో జనసేన పార్టీతో కలసి పనిచేయాలని సీపీఎం పార్టీ అభిలాషను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ వ్యవహారాల కమిటీతో తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సీపీఎం నేతలు జరిపిన సమావేశం వివరాలను ప్యాక్ విశ్లేషించింది. ఆ సమావేశం వివరాలు, ప్యాక్ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షునికి సమర్పించాలని సమావేశం నిర్ణయించింది.

More Telugu News