కేన్సర్ పై ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది: సీఎం చంద్రబాబు
- తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ
- రతన్ టాటాతో కలిసి భూమి పూజ చేసిన చంద్రబాబు
- రూ.1000 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన 25 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. మొత్తం వెయ్యి పడకలకు గాను తొలిదశలో 376 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని, ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు కేన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా కేన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారని తెలిపారు. కేన్సర్ చికిత్స కోసం అధునాతన పరికరాలను వినియోగిస్తారని, ఈ ఆసుపత్రి దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉంటుందని, శ్రీ వేంకటేశ్వరుడి పాదపద్మాల కింద ఈ ఆసుపత్రి రావడం మన అందరి అదృష్టమని, ఇందుకు చొరవ తీసుకున్న టాటా ట్రస్ట్ ను ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని అన్నారు. కాగా, వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది.