modi: మోదీకి అమిత్ షా కన్నా కేసీఆర్ అత్యంత సన్నిహితుడు!: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయనపై టీ-సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కన్నా కేసీఆరే అత్యంత సన్నిహితుడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమూ ప్రగతి సాధించలేదని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని, రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఆ ఖాళీలను భర్తీ చేయలేకపోయారని మండిపడ్డారు. కొత్త జిల్లాలను ఆమోదింప చేసుకోవడానికి జోనల్ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించిన జీవన్ రెడ్డి, ఇచ్చిన హామీలను నెరవేర్చనప్పుడు ప్రజలను ఓట్లు అడిగే అర్హత ఉండదని అన్నారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Go Back to Shorts
modi
kcr
Jeevan Reddy

More Telugu News