paritala: భయం వేస్తోందా? అని పరిటాల రవి అడిగేవారు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'శ్రీరాములయ్య'కి ఎన్నో ఆటంకాలు 
  • వాటిని దాటుకుని షూటింగ్ మొదలైంది 
  • 100 రోజులు ఆడేసింది    

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ  మాట్లాడుతూ, 'శ్రీరాములయ్య' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమా షూటింగ్ ఎన్నో ఆటంకాలను .. అవాంతరాలను దాటుకుని మొదలైంది. వెంకటాపురంలోని ఇంట్లో వుంటూ షూటింగ్ చేస్తున్నాం. 'అన్నా భయం వేస్తోందా?' అంటూ పరిటాల రవి తరచూ అడిగేవాడు.

'నువ్ ఉండగా మాకెందుకయ్యా భయం? అని నేను అనేవాడిని. నువ్వుండగా ఇక్కడ ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ అందరికీ నువ్వే కొండంత అండ అంటే నవ్వేవాడు. వెంకటాపురంలో పది రోజుల పాటు వుండి, అక్కడి స్థూపం దగ్గర .. మరికొన్ని చోట్ల షూటింగు చేసుకుని వచ్చాము. ఆ సినిమా అద్భుతంగా ఆడింది .. మంచి పేరు తెచ్చింది .. 100 రోజుల షీల్డ్ ఇంటికి వచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News