కేరళ వరద బాధితులకు రజనీకాంత్ సాయం.. రూ.15 లక్షల విరాళం!
- కేరళలో ఇంకా తగ్గని వరద ఉద్ధృతి
- సాయం కోసం బాధితుల ఎదురుచూపులు
- సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
వరదల కారణంగా కేరళలో 300 మందికిపైగా మరణించగా, 3.14 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ముందుకొచ్చి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించాలని కోరారు. తాను కూడా తనకు తోచినంత సాయం చేస్తున్నానని పేర్కొన్నారు.
కేరళ ఐఏఎస్ అధికారులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. హ్యుందయ్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ స్టీఫెన్ సుధాకర్, ఆ సంస్థ సౌత్ జోన్ బిజినెస్ హెడ్ వైఎస్ చాంగ్ సీనియర్ కలిసి కేరళ సీఎం పినరయి విజయన్కు కోటి రూపాయల చెక్ అందించారు.