సోమయాన్ పేరును చంద్రయాన్గా మార్చిన వాజ్పేయి!
- నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ఇస్రో మాజీ చైర్మన్
- అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఆరితేలాలని వాజ్పేయి ఆంకాక్ష
- చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలనే దానికి ‘-1’ అని పేరుపెట్టిన వైనం
వాజ్పేయి మరణానంతరం ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్పేయితో కలిసి నాలుగేళ్లు పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. వాజ్పేయి తన మనసును హత్తుకున్న నేత అని పేర్కొన్న ఆయన సహచరులు, జూనియర్లతో ఆయనతో వ్యవహరించే విధానం తనను ఆకట్టుకుందని తెలిపారు. తాను 59వ ఏట రైటర్ అవుతున్నట్టు ఆయనకు లేఖ రాస్తే.. మీరింకా యువకులే.. బాగా పనిచేస్తున్నారని చెబుతూ 62 ఏళ్ల వరకు కొనసాగాలని ఆదేశించారని చెబుతూ కస్తూరి రంగన్ భావోద్వేగానికి గురయ్యారు.