jagan: 13న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ఆనం

  • 11వ తేదీన ప్రారంభం కానున్న శ్రావణ మాసం
  • 13న విశాఖకు చేరుకోనున్న జగన్ పాదయాత్ర
  • జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ఆనం

వైసీపీలోకి చేరడానికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 11వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం శుభకార్యాలకు మంచిది కావడంతో ఈ మాసంలో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. షెడ్యూల్ ప్రకారం 13వ తేదీన జగన్ పాదయాత్ర విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభ వేదికపై జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని రామనారాయణరెడ్డి భావిస్తున్నట్టు సమాచారం.

More Telugu News