రాజకీయ రణరంగంలోకి సోనియా తనయ.. తల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి ప్రియాంకా గాంధీ!
- ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ వాద్రా
- తల్లి స్థానాన్ని భర్తీ చేసేందుకు రెడీ?
- ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి ప్రకటన
మరోవైపు, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రకటించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్లో వ్యూహాత్మక పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు, శివసేనతో మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి ముందుకు వెళ్లరాదని కాంగ్రెస్ తీర్మానించుకున్నట్టు సమాచారం. రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్లలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫలితాల తర్వాతే ప్రకటించాలని కాంగ్రెస్ యోచిస్తోంది.