ముస్లిం జనాభా పెరగడం వల్లే దేశంలో ఉగ్రవాదం, అత్యాచారాలు పెరిగాయి!: బీజేపీ ఎంపీ హరి ఓం పాండే ఆరోపణ

షార్ట్స్‌లో చూడండి
భారత్ లో ముస్లింల జనాభా పెరుగుదల కారణంగానే దేశంలో ఉగ్రవాదం, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ హరి ఓం పాండే తెలిపారు. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి దేశంలో ముస్లింల జనాభా వేగంగా పెరుగుతూనే ఉందన్నారు. దీనివల్లే ఉగ్రవాదం, అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి నేరాలు దేశంలో తగ్గడంలేదని వ్యాఖ్యానించారు.


ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ముస్లింల జనాభాను ప్రభుత్వం నియంత్రించకుంటే త్వరలోనే భారత్ నుంచి మరో పాకిస్తాన్ ఏర్పడుతుందని హెచ్చరించారు. జనాభా పెరుగుదల వల్ల నిరుద్యోగం ఏర్పడి దేశ ఆర్థిక ప్రగతి మందగిస్తుందని పాండే పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అప్పుడే మరోసారి దేశ విభజన జరగకుండా ఆపగలమని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
India
muslims
Hari om pandey
population
rape
murder
partition
Pakistan
BJP
Uttar Pradesh

More Telugu News