విభజన హామీలు నెరవేరిస్తే ఇక ఇబ్బందులేముంటాయి?: సీఎం చంద్రబాబు

  • హామీలు అమలు చేయకపోవడం వల్లే బీజేపీకి టీడీపీ దూరమైంది
  • రాష్ట్ర  ప్రయోజనాల సాధనకు అంతా ఐక్యంగా ఉండాలి
  • విభజన సమస్యలు అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం
విభజన హామీలను అమలు చేయకపోవడం వల్లే బీజేపీకి టీడీపీ దూరమైందని, ఆ హామీలు నెరవేరిస్తే ఇక ఇబ్బందులేముంటాయని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖపట్టణం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విభజన హామీలన్నింటిని కేంద్రం నెరవేరుస్తామని చెబుతోంది కానీ, ఎంత సమయంలో వాటిని అమలు చేస్తారనేది ముఖ్యమని అన్నారు. ఈ హామీలను ఐదేళ్లలో కాకుండా పదేళ్లలో అమలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించేందుకు అంతా ఐక్యంగా ఉండాలని, విభజన సమస్యలను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతి రూపాయికీ కేంద్రానికి లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధమని అన్నారు. ‘పోలవరం’ ఖర్చు మొత్తాన్ని భరిస్తామన్న నితిన్ గడ్కరీ ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు.
Go Back to Shorts
Chandrababu
gadkari

More Telugu News