mangalagiri: మంగళగిరి ఎయిమ్స్ గురించి ఏపీకి తీపి కబురు చెప్పిన కేంద్ర మంత్రి నడ్డా!

షార్ట్స్‌లో చూడండి
మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్ ను గడువుకంటే ముందుగానే పూర్తి చేసి, ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ ను నెలకొల్పారని... రూ. 1618 కోట్లతో ఎయిమ్స్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆగస్ట్ నెలలో వైద్య విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తామని, మెరుగైన ఫ్యాకల్టీని అందిస్తామని తెలిపారు. 2019 జనవరి నాటికి ఔట్ పేషెంట్ బ్లాక్ ను సిద్ధం చేస్తామని చెప్పారు.
ఈరోజు ఎయిమ్స్ నిర్మాణ పనులను నడ్డా పరిశీలించారు. అనంతరం, నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో నడ్డాకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు.



Go Back to Shorts
mangalagiri
aiims
jp nadda

More Telugu News