Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తేజ కోసం పారితోషికాన్ని తగ్గించుకున్న కాజల్
  • బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో మరో చిత్రం
  • లండన్ లో రకుల్ నెల రోజుల మకాం  

*  ఇటీవల తేజ దర్శకత్వంలో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్ మరోసారి ఆయన దర్శకత్వంలో నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందే ఈ చిత్రం కోసం అమ్మడు పారితోషికాన్ని కూడా తగ్గించుకుందట. తేజ మీదున్న అభిమానంతో పాటు చిత్రంలోని పాత్ర కూడా తనకు బాగా నచ్చడం వల్ల కాజల్ రెమ్యూనరేషన్ బాగా తగ్గించిందట.
*  బాలకృష్ణ, బోయపాటిలది హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఈ కలయికలో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. మాస్ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతుంది.
*  నెల రోజుల షూటింగ్ కోసం అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం లండన్ లో వుంది. అకీవ్ అలీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం కోసం ఈ చిన్నది లండన్ వెళ్లింది. అక్కడ ఈ చిత్రం కోసం నెల రోజుల షూటింగ్ నిర్వహిస్తారు.

More Telugu News