E-pass: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

  • ఊటీ, కొడైకెనాల్ వెళ్లే ప‌ర్యాట‌కుల‌కు ఈ నెల‌ 7 నుంచి ఈ-పాస్ త‌ప్ప‌నిస‌రి 
  • సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ
  • ఈ వేస‌వి విడిది కేంద్రాల‌కు వెళ్లే టూరిస్టులు వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఈ-పాస్ పొందే వెసులుబాటు
Epass Mandatory for Tourist who went Ooty Kodaikanal

మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాల మేర‌కు వేస‌వి విడిది కేంద్రాలైన‌ ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి ఈ నెల‌ 7వ తేదీ నుంచి ఈ-పాస్ త‌ప్ప‌నిస‌రి అంటూ ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ప‌ర్యాట‌కులు త‌మ వివ‌రాలు, వాహ‌నాల నంబ‌రు, వ‌చ్చే రోజు, బ‌స చేసే రోజులు, బ‌స చేసే చోటు వంటి వివ‌రాల‌ను ఆన్‌లైన్ ద్వారా వెల్ల‌డించి ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది. 

ఇక‌పై ఊటీ, కొడైకెనాల్ వెళ్లే టూరిస్టులు, వ్యాపారులు epass.tnega.org వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఈ-పాస్ పొంద‌వ‌చ్చు. కాగా, వాహ‌న ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డానికే ఈ విధానం అమ‌లు చేసిన‌ట్టు త‌మిళ‌నాడు స‌ర్కార్ వెల్ల‌డించింది. ఇక ఈ విధానం జూన్ 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అమ‌లులో ఉంటుంద‌ని, దీనివ‌ల్ల‌ ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News