Bengaluru Metro: బెంగళూరుకు పాకిన పైత్యం.. మెట్రో రైల్ లో జంట అసభ్య చేష్టలు

  • జనం చూస్తుండగా ముద్దులు పెట్టుకున్న జంట
  • వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు
  • స్పందించిన పోలీసులు.. యువ జంటను గుర్తించేందుకు ప్రయత్నాలు
Video Shows Couple Getting Intimate Inside Bengaluru Metro Police Responds

ఢిల్లీ మెట్రో రైల్ లో యువ జంటలు రెచ్చిపోవడం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం నిన్నమొన్నటి సంగతి. ఇప్పుడు ఈ పైత్యం బెంగళూరుకూ పాకింది. తాజాగా బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా ప్రేమ మైకంలో తేలిపోయారు. ఒకరినొకరు హత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. వీరి వ్యవహారం చూసి చిర్రెత్తిపోయిన ప్రయాణికుడు ఒకరు ఈ తతంగాన్నంతా తన ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. బెంగళూరు మెట్రో అధికారులతో పాటు పోలీసులకు ట్యాగ్ చేసి ఆ యువ జంటపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన సదరు వీడియోలో యువ జంట నిల్చుని ఉండగా పక్కనే ఓ పెద్దాయన కూర్చుని కనిపిస్తున్నాడు. చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆ యువతి తన సహచరుడి మీద వాలిపోయింది. పదకొండు సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్ పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. ఆ తర్వాత వారు మరింత రెచ్చిపోయారని, పబ్లిక్ ప్లేసులో ముద్దులు పెట్టేసుకున్నారని చెప్పాడు. అయితే, అదంతా రికార్డు చేయలేక వదిలేశానని వివరించాడు. కాగా, ఈ ట్వీట్ పై పోలీసులు స్పందించారు. ఆ యువజంటను గుర్తించి, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News