జీఎస్టీ విషయంలో రాహుల్ ఆలోచన చాలా తప్పు!: అరుణ్ జైట్లీ
- అన్ని వస్తువుల పన్నును ఒకే శ్లాబు కిందకు తీసుకురావడం అసాధ్యం
- ప్రజలందరికీ ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉంటేనే అది సాధ్యం
- ఇప్పటికే చాలా వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించాం
దేశంలోని వస్తువులన్నింటి పన్నులను ఒకే పరిధిలోకి తీసుకు రావాలని రాహుల్ సూచిస్తున్నారని... ఆయన ఆలోచన చాలా తప్పు అని జైట్లీ అన్నారు. సింగపూర్ ప్రజలకు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉందని... అలాంటి చోట అయితే ఒకే శ్లాబును అమలు చేయవచ్చని చెప్పారు. ఇరు దేశాల జనాభా సంఖ్యలో కూడా పూర్తి వ్యత్యాసం ఉందని చెప్పారు. ఇప్పటికే చాలా వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి తొలగించామని తెలిపారు.