Krishna District: బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థుల అత్యాచారం.. వీడియో తీసిన వైనం

  • కృష్ణా జిల్లాలో ఘటన
  • గతేడాది అత్యాచారం
  • తాజాగా వీడియోలతో బ్లాక్‌మెయిల్‌
  • పోలీసులకు విద్యార్థిని తండ్రి ఫిర్యాదు

కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థినిపై సీనియర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఆగిరిపల్లి పోలీస్‌ స్టేషనుకి వచ్చిన ఆ విద్యార్థిని తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేసి వివరాలు తెలిపారు.

గతేడాది తన కూతురిపై కృష్ణవంశీ, శివారెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడి వీడియో చిత్రీకరించారని చెప్పారు. తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ పట్టించుకోలేదని, తాజాగా, డీ ప్రవీణ్ అనే మరో విద్యార్థి ఆ వీడియోలతో తమ కూతురిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  

More Telugu News