సీఎం రమేష్ ను కలిసి మద్దతు ప్రకటించిన కనిమొళి.. కేంద్రంపై ధ్వజం
- కడప దీక్షాస్థలికి వచ్చిన కనిమొళి
- ఏపీ పోరాటానికి మా మద్దతు ఉంటుందంటూ ప్రకటన
- రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందంటూ విమర్శ
ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ, ఏపీ హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో సీఎం రమేష్ పోరాడారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంటే... ఈ పాటికి విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరేవని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు. హిందుత్వం తప్ప బీజేపీకి మరేదీ పట్టదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.