పతంజలి మెసేజింగ్ యాప్ 'కింభో' వచ్చేస్తోంది: బాబా రామ్దేవ్ ప్రకటన
- యాప్లో సాంకేతిక సమస్యలుండడంతో తొలగించిన నిర్వాహకులు
- సమస్యలను తొలగిస్తోన్న పతంజలి
- రెండు నెలల్లో అధికారికంగా విడుదల
మరో రెండు నెలల్లో ‘స్వదేశీ మెసేజింగ్ యాప్’ను అధికారికంగా విడుదల చేస్తామని యోగా గురు బాబా రామ్ దేవ్ తాజాగా ప్రకటన చేశారు. తమ యాప్ టెస్టింగ్ దశలోనే భారీగా ట్రాఫిక్ను ఎదుర్కొందని, యూజర్ ట్రాఫిక్ను ఎలా నిర్వహించాలో పరిశీలిస్తున్నామని చెప్పారు. 'ఇప్పుడు భారత్ మాట్లాడుతుంది' అనే నినాదంతో ఈ యాప్ వస్తోంది.