woman: చెప్పుతో కొట్టిన మహిళ.. కాలితో తన్నిన ఎంపీపీ.. వీడియో వైరల్

  • మహిళకు, ఎంపీపీకి మధ్య స్థలానికి సంబంధించిన గొడవ
  • రిజిస్ట్రేషన్ తర్వాత అదనంగా డబ్బులు అడిగారంటూ మహిళ ఆగ్రహం
  • ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం

నిజామాబాద్ జిల్లాలోని ఇందల్ వాయ్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థలాన్ని విక్రయించే విషయంలో ఓ మహిళకు చెందిన కుటుంబానికి, స్థానిక ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత, ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపైనే ఎంపీపీ ఇంటి ముందు ఆమె తన బంధువులతో కలసి నిరసనకు దిగింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఎంపీపీని సదరు మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో, ఆమెను ఆయన కాలితో తన్నాడు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News