వైసీపీతో మంతనాలు జరుపుతున్న టీడీపీ ఎంపీ అవంతి
- భీమిలి నుంచి గంటాపై పోటీకి సిద్ధపడుతున్న అవంతి
- ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రివర్గంలో చోటు సంపాదించడమే లక్ష్యం
- అవంతిని అడ్డుకునేందుకు యత్నిస్తున్న భీమిలి వైసీపీ నేతలు
ఇదిలా ఉంచితే, భీమిలి వైసీపీ నేత జి.వెంకటరెడ్డి ఆ నియోజకవర్గ పార్టీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అవంతిని వైసీపీలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే ఆ మెసేజ్ సారాంశం. టీడీపీ ఎంపీ వైసీపీలోకి చేరబోతున్న నేపథ్యంలోనే, వెంకటరెడ్డి ఈ మెసేజ్ పెట్టారు. దీంతో, వైసీపీలోకి అవంతి వెళ్లనున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు అవంతి అందుబాటులో లేరు.