Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోరాట యాత్రకు రేపు బ్రేక్!

  • పవన్ కు కనీస పోలీస్ భద్రత కల్పించడంలేదు
  • సొంత భద్రతా సిబ్బందితోనే తన పర్యటన కొనసాగిస్తున్నారు
  • ఈ పర్యటనలో పవన్ భద్రతా సిబ్బందిలో 11 మంది గాయపడ్డారు
  • కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది

శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పోరాట యాత్రకు రేపు విరామం ప్రకటించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది. పవన్ కు కనీస పోలీస్ భద్రత కల్పించడం లేదని, సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఈ  పర్యటనలో పవన్ భద్రతా సిబ్బందిలో 11 మంది గాయపడ్డారని, కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉందని తెలిపింది. అందుకని, రేపటి యాత్రకు విరామం ప్రకటిస్తున్నామని, పవన్ తదుపరి షెడ్యూల్ ని రేపు సాయంత్రం విడుదల చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.

More Telugu News