Karnataka: ప్రాంతీయ పార్టీల పవర్ ఏంటో భవిష్యత్తులో చూస్తారు!: సీఎం కేసీఆర్

  • కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించిన దేవెగౌడ 
  • కుమారస్వామి సీఎం కానుండటం సంతోషంగా ఉంది
  • ఆయనకు దేవుడి దీవెనలు ఉంటాయన్న కేసీఆర్

కర్ణాటక సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు సాయంత్రం కలిసి అభినందనలు తెలిపారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు దేవెగౌడ స్వయంగా పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. దేవెగౌడ, కుమారస్వామిగౌడ, రేవన్నలతో కేసీఆర్ ముచ్చటించారు. 

ఈ సందర్భంగా  కుమారస్వామిగౌడకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం, మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ, కుమారస్వామి సీఎం కానుండటం సంతోషంగా ఉందని, ఆయనకు దేవుడి దీవెనలు ఉంటాయని అన్నారు. ప్రాంతీయ పార్టీల పవర్ ఏంటో భవిష్యత్ లో చూస్తారని..ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. 

More Telugu News