Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాల్లో కలకలం... సామూహిక బాల్య వివాహాలు

  • జగద్గిరి గుట్టలో ఐసీడీఎస్‌, పోలీసు అధికారుల తనిఖీలు
  • ఇప్పటివరకు 3 జంటలను మైనర్లుగా గుర్తించిన అధికారులు
  • యువతీయువకుల వయసు పరిశీలిస్తోన్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా జగద్గిరి గుట్టలో చట్ట వ్యతిరేక కార్యాకలాపాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో సామూహిక బాల్య వివాహాలు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు నిర్వాహకులు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఐసీడీఎస్‌, పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు.

వధూవరుల వయసు నిర్ధారణ కోసం పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అందులోని మూడు జంటలను మైనర్లుగా గుర్తించిన అధికారులు, ఇతర యువతీయువకుల వయసుపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.          

More Telugu News