raviteja: రవితేజ సరసన ఇలియానా .. శ్రుతి హాసన్?

  • రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని'
  • చకచకా జరుగుతోన్న షూటింగ్ 
  • కథానాయికల ఎంపికపై దృష్టి  

రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ఈ మూడు పాత్రల్లోను రవితేజ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రలకి జోడీగా ముగ్గురు కథానాయికలను తీసుకోనున్నారు. ఒక హీరోయిన్ గా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేనని భావించిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో ఆ ప్లేస్ లోకి ఇలియానాను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో రీ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఇలియానా ఈ ఛాన్స్ వదులుకోక పోవచ్చని అంటున్నారు. ఆమె ఓకే అంటే ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో సందేహం లేదు. ఇక మరో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.  

More Telugu News