కర్ణాటక ఎన్నికలు ముగియడంతో మళ్లీ మొదలైన ‘పెట్రో’ ధరల బాదుడు
- ఢిల్లీలో పెట్రల్ పై 17పైసలు, డీజిల్ పై 21 పైసలు పెరుగుదల
- గత నె 24న చివరి సారి సవరణ
- ఇన్ని రోజులుగా పెంపును పక్కన పెట్టిన చమురు కంపెనీలు
అయితే, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పెట్రోలియం ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం ఆపేయించింది. దీంతో గత నెల 24 తర్వాత నుంచి ధరలు పెరగకుండా అలానే ఉండిపోయాయి. గత శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం విదితమే. దీంతో మరోసారి ధరల సవరణ మొదలైంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 17 పైసలు పెంచారు. డీజిల్ పై 21 పైసలు పెరిగింది. కేంద్ర ప్రభుత్వమే ఆయిల్ కంపెనీలను ధరల సవరణ చేపట్టవద్దని నిరోధించి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.