TTD: తిరుమల దేవస్థానాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలన్న నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది: కేఈ కృష్ణమూర్తి

  • పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర సర్కారు యోచన
  • భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి
  • ఎవరికి ఏ అనుమానాలున్నా నివృతి చేస్తాం
  • చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

తిరుమల ఆలయాలన్నీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోన్న విషయం తెలిసిందే. తిరుమలలో ఉన్న ఆలయాలు, వాటి చరిత్రను పరిశీలించిన పురావస్తు శాఖ.. అవన్నీ పూర్వకాలంలో నిర్మాణమైనవిగా గుర్తించినట్లు వెల్లడించింది. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరవైందని ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. అయితే, ఈ విషయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

    తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలన్న పురావస్తు శాఖ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోందని కేఈ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీకి సంబంధించి ఏ నిర్ణయం అయినా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని, ఈ ఆలయానికి ప్రపంచంలో ఎంతో ప్రత్యేకత ఉందని వ్యాఖ్యానించారు. ఎవరికి ఏ అనుమానాలున్నా నివృతి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, టీటీడీ, వాటి ఉప ఆలయాలను పరిరక్షించుకునే సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

More Telugu News