Chandrababu: కతువా, ఉన్నావో దుర్ఘటనలపై స్పందించిన చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
కతువా, ఉన్నావో ఘటనల బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పలుచోట్ల వేల మంది ఆందోళనకారులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దుర్ఘటనలు మానవత్వానికే మాయని మచ్చ అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా స్పందించారు. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా, వారిని కఠినంగా శిక్షించాలని, నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News