చంద్రబాబును సీబీఐ విచారించబోతోంది: గంటా శ్రీనివాస్
- చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీ
- సీబీఐని ఉసిగొల్పిందని గంటా ఆరోపణ
- బీజేపీ విమర్శల వెనుక రాజకీయ కుట్ర
- ఏ విచారణకైనా సిద్ధమని వెల్లడి
చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించాలని మోదీ భావిస్తున్నారని, అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరి ఉచ్చులోనూ పడబోరని అన్నారు. చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన ఆయన, తండ్రి వల్లే కానిది కొడుకు జగన్ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. ఎప్పుడు ఏం చేయాలో చంద్రబాబుకు బాగా తెలుసునని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఎవరైనా ఆయన తరువాతేనని గంటా శ్రీనివాస్ అన్నారు.