రాజ్ ఘాట్ వద్ద దీక్షకు దిగిన టీడీపీ ఎంపీలు
- రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీలు
- మహాత్ముడికి నివాళి అర్పించిన నేతలు
- తెల్లటి దుస్తులు ధరించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన
తొలుత ఎంపీ తోట నర్సింహం నివాసంలో సమావేశమైన ఎంపీలు అక్కడి నుంచి నేరుగా రాజ్ ఘాట్ కు వెళ్లారు. అనంతరం అక్కడ మహాత్ముడికి నివాళి అర్పించారు. ఆ తర్వాత మౌన దీక్షకు దిగారు. శాంతి యుతంగా తమ నిరసనను తెలుపుతున్నారు. అంతకు ముందు ఎంపీలు మాట్లాడుతూ, విభజన హామీలను నెరవేర్చాల్సిందేనని... అంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలంతా తెల్లటి దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించారు.