Uttar Pradesh: యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణ .. సీఎం ఇంటిముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇంటి ముందు ఓ మహిళ తన కుటుంబంతో సహా ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గురించి బాధిత మహిళ మాట్లాడుతూ, ఏడాది క్రితం కుల్ దీప్ సింగ్ తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది.

 ఈ సంఘటనపై ఎఫ్ ఐఆర్ నమోదైతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపింది. తనకు న్యాయం జరగడం లేదని, ఈ వ్యవహారంలో సంబంధమున్న అందరినీ శిక్షించకపోతే తాను చచ్చిపోతానంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.

కాగా, ఈ కేసుపై లక్నో జోన్ అదనపు డీజీపీ రాజీవ్ కిషన్ మాట్లాడుతూ,  ఈ వ్యవహారం ఇప్పటి వరకూ తేలకపోవడం వాస్తవమేనని అన్నారు. ఈ కేసును లక్నో న్యాయస్థానానికి అప్పగించారని, విచారణ జరిగితే గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపారు. బాధితురాలి కుటుంబంపై దాడి జరిగిన విషయమై తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Uttar Pradesh
cm yogi

More Telugu News