Chandrababu: వైసీపీ లాలూచీ రాజకీయాలను ఎండగట్టండి : సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ లాలూచీ రాజకీయాలను ప్రజల్లో ఎండగట్టాలని తమ పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తీరుపై, వైసీపీ వ్యవహార శైలిపై చర్చించారు. కుట్రలకు పాల్పడే వారు చెప్పి చేయరని, ఆ కుట్రలను సకాలంలో బయటపెట్టకపోతే మనం విఫలమవుతామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ‘దళిత తేజం’ తరహాలో మే నెల నుంచి అక్టోబర్ వరకు బీసీ, ఎస్టీ, మైనారిటీ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
Go Back to Shorts
Chandrababu
Telugudesam

More Telugu News