తమిళనాడు రాజకీయ తెరపైకి మరో కొత్త పార్టీ...!
- ఈ నెల 15న కొత్త పార్టీ ప్రకటించనున్న టీటీవీ దినకరన్
- మధురైలో భారీ బహిరంగ సభ వేదికగా ప్రకటన
- కొత్త పార్టీలతో రసవత్తరంగా మారనున్న తమిళ రాజకీయాలు
మధురైలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ప్రజాదరణ ఉన్న అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడం, పార్టీ రెండాకుల గుర్తును కూడా న్యాయపోరాటంలో కోల్పోవడంతో దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే ప్రజల ఆదరణ మెండుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటుగా కమల్, రజనీ పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుండటంతో అక్కడి రాజకీయాలు నిస్సందేహంగా రసవత్తరంగా మారనున్నాయి.