ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై ప్రియాంక చోప్రా దావా?
- నీరవ్ డైమండ్ బ్రాండ్ కు ప్రచారకర్తగా ఉన్న ప్రియాంక చోప్రా
- ఓ వ్యాపార ప్రకటన పారితోషికం ఎగ్గొట్టారని ఆరోపణ
- నిజమేనంటున్న బాలీవుడ్ వర్గాలు
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ప్రియాంక ఈ వ్యాపార ప్రకటనలో నటించింది. ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన పారితోషికాన్ని ఆమెకు, సిద్ధార్థ్ మల్హోత్రాకు ఇంత వరకూ ఇవ్వలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం. కాగా, పీఎన్ బీలో నీరవ్ మోదీ కుంభకోణం బయటపడటంతో నీరవ్ సన్నిహితులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు అతనికి దూరంగా ఉంటున్నట్టు సమాచారం.