నల్గొండ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. గ్రామంలో ఉద్రిక్తత!
- మంచం కింద బాంబు పెట్టిన దుండగులు
- చెల్లాచెదురైన శరీర భాగాలు
- పాతకక్షలే కారణమన్న పోలీసులు
ధర్మానాయక్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మానాయక్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.