Rajasthan: బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని.. ఐదుగురి మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

  • రాజస్థాన్‌లోని భుటేలాలో ఘటన
  • ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగానే మృతి చెందార‌ని వైద్యుల నిర్ధారణ
  • విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ పోలీసుల విచారణ

రాజస్థాన్‌లోని భుటేలాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లి స‌ర‌దాగా గ‌డిపి వ‌ద్దామ‌నుకున్న ఐదుగురు వ్య‌క్తులు హ‌ల్వా తిని ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగానే వారు మృతి చెందార‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు వచ్చారని, వారి కోసం ఆ కుటుంబీకులు హల్వా చేసి వడ్డించగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని వివ‌రించారు. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News