నేడు ఏపీ బంద్... బంద్ కు వివిధ పార్టీల మద్దతు!
- ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన వామపక్ష పార్టీలు
- బంద్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన, లోక్ సత్తా పార్టీలు
- బంద్ కు మద్దతివ్వమని, కేవలం నిరసనలు మాత్రం చేస్తామని ప్రకటించిన టీడీపీ
కాగా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తాము కేవలం నిరసనలు మాత్రం తెలుపుతామని టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్ కు మద్దతు తెలపాలని వామపక్ష పార్టీలు ఇతరపార్టీలను కోరగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన, లోక్ సత్తా తదితర పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ను పురస్కరించుకుని విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి. అయితే ప్రభుత్వ సంస్థలు యథావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నప్పటికీ, వాటిని అడ్డుకుంటామని ప్రజా సంఘాలు ప్రకటించాయి.