కాబూల్‌లో ఉగ్ర బీభత్సం... 95 మంది మృతి.. స్పందించిన భారత్

  • తామే దాడి చేశామని ప్రకటించుకున్న తాలిబాన్
  • హక్కాని హస్తం కూడా ఉన్నట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటన
  • ఆప్ఘనిస్థాన్‌కి అవసరమైన సాయం చేయడానికి సిద్ధం: భారత్
ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే ప్రదేశంలో కారు బాంబు దాడి చేసి 95 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో మరో 163 మందికి గాయాలయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడి వెనుక హక్కాని హస్తం కూడా ఉన్నట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. కాగా, ఈ ఉగ్రదాడిపై భారత్ స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.

ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కున్న ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం, ప్రజల వైపున నిలబడతామని భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయడానికి, గాయాలపాలైన వారికి చికిత్స అందించడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది. 
Go Back to Shorts
afghanistan
kabul
terrirists
attack
India

More Telugu News