2023 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు రెడీ!
- జపాన్ దేశ కాన్సుల్ జనరల్ నోడా ప్రకటన
- షింజో అబే భారత పర్యటనతో బలపడిన బంధం
- జపాన్ ను సందర్శించే భారతీయులు తక్కువే
‘‘గతేడాది సెప్టెంబర్ లో షింజో అబే, నరేంద్ర మోదీ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కేవలం రెండు గంటల వ్యవధిలో ఇది అనుసంధానించగలదు. ఈ ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలి’’ అని నోడా పేర్కొన్నారు. జపాన్ ను పర్యాటక ప్రదేశంగా భారతీయుల్లో ప్రచారం చేస్తున్నామని, అయినా తమ దేశానికి వచ్చే భారతీయులు చైనీయుల కంటే తక్కువ అని తెలిపారు.