పంచాయతీ ఎన్నికల వేడి పుట్టించిన కేసీఆర్.. వచ్చే నెలలోనే ఎన్నికలు!
- తెలంగాణలో కొత్తగా మరో 4 వేల పంచాయతీల ఏర్పాటు
- ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై విధానపరమైన నిర్ణయం
- ఒక్కో పంచాయతీకి మధ్య రెండు కిలోమీటర్ల దూరం
కొత్తగా ఏర్పాటు చేయబోయే పంచాయతీలకు సంబంధించి సరిహద్దులను నిర్ణయించి ఈనెల 25 నాటికి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కొత్త పంచాయతీ జనాభా కనీసం 500 ఉండేలా చూడాలని సూచించారు. అలాగే విడిపోతున్న పంచాయతీకి, కొత్త పంచాయతీకి మధ్య కనీసం రెండు కిలోమీటర్ల దూరం ఉండాలని అన్నారు. పంచాయతీల ఏర్పాటు వివాదానికి తావులేకుండా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,684 పంచాయతీలు ఉన్నాయని, మరో 4వేల కొత్త పంచాయతీలు ఏర్పాటు కావచ్చని సీఎం వివరించారు.