indigo: రూ. 1500లోపే విమాన టిక్కెట్... అంద‌జేస్తోన్న ఇండిగో

  • జ‌న‌వ‌రి బుకింగ్స్‌కి మాత్ర‌మే
  • కొత్త సంవ‌త్స‌ర ఆఫ‌ర్‌లో భాగం
  • ఢిల్లీ నుంచి ల‌క్నో వ‌ర‌కు రూ. 1030

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌, విమాన ప్ర‌యాణ ధ‌ర‌ల‌పై ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా కొన్ని ప్రాంతాల మ‌ధ్య విమాన టిక్కెట్ల‌ను రూ. 1500ల కంటే త‌క్కువ‌కే అంద‌జేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్‌లో భాగంగా ఢిల్లీ నుంచి ల‌క్నోకి టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.1030, బాగ్డోగ్రా నుంచి గౌహ‌తికి ప్రారంభ ధర రూ.1005, కోయంబత్తూర్‌ నుంచి చెన్నైకి రూ.1095గా పేర్కొంది.

అంతేకాకుండా ప్రతి ప్యాసింజర్‌ కన్వీనియన్స్‌ ఫీజుగా రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. ఈ టిక్కెట్‌ ధరలు జనవరిలో బుకింగ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండ‌నున్నాయి. వీటితో పాటు చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా నిర్ణయించిన‌ట్లు త‌మ‌ వెబ్‌సైట్లోని బుకింగ్‌ పోర్టల్‌లో ఇండిగో పేర్కొంది.

More Telugu News