crpf: సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ‘ఉగ్ర’ దాడి.. నలుగురు జవాన్ల మృతి

షార్ట్స్‌లో చూడండి
దక్షిణ కాశ్మీర్ లోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పుల్వామా జిల్లా లెత్ పొరలో ఈరోజు తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్టు సమాచారం. ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసురుతూ, శిక్షణ కేంద్రంలోకి చొరబడేందుకు యత్నించారు. దీనికి దీటుగా స్పందించిన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

కాగా, ఈ సంఘటనకు పాల్పడింది తామేనంటూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, జైషే మహ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ ను భద్రతా బలగాలు ఇటీవల మట్టుబెట్టాయి. ఇందుకు ప్రతీకారంగానే సీఆర్పీఎఫ్ శిక్షణా శిబిరంపై వారు దాడికి పాల్పడ్డట్లు సమాచారం.
Go Back to Shorts
crpf
Jammu and Kashmir

More Telugu News