ఒక భారతీయ వనితగా గర్విస్తున్నా!: నటి త్రిష
- యునిసెఫ్ హోదా లో స్వచ్ఛ భారత్ ప్రచారం
- ఈ హోదా దక్కిన తొలి దక్షిణ నటి త్రిష
- అభిమానుల్లో ఆనందం
తాజాగా త్రిష స్వచ్ఛ భారత్ కి స్ఫూర్తి నింపేలా తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ చోట మరుగుదొడ్డి నిర్మాణంలో స్వయంగా పాల్గొంది. ముఖ్యంగా మహిళలు ఎవరూ బహిర్భూమికి వెళ్లకూడదని పిలుపునిచ్చింది. క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న త్రిష ఇలాంటి గొప్ప పనులు చేయడంతో అభిమానులందరూ తెగ మెచ్చుకుంటున్నారు.