నవ్వుతూ వెళ్లిన ఆడపిల్లలు విగతజీవులై వచ్చారని విలపిస్తున్న తల్లిదండ్రులు!
- గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- నిషేధమున్నా అదనపు తరగతులు నిర్వహిస్తున్న స్కూల్
- వెళ్లిన అరగంటలోనే దారుణమైన వార్త వినిపించింది
- ఏడుస్తూ వెల్లడించిన ఓ విద్యార్థిని తండ్రి
ఎక్స్ ట్రా క్లాసులు ఇంతమందిని బలిగొన్నాయని ఆరోపించారు. స్కూలుకు వెళ్లి వస్తామని నవ్వుతూ తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిందని, ఆపై అరగంటలోనే దారుణమైన వార్తను విన్నామని ఓ బాలిక తండ్రి ఏడుస్తూ చెప్పాడు. ప్రమాద స్థలిలో రక్తంతో తడిసిన పుస్తకాలు, భోజనం క్యారేజీలు చూపరుల హృదయాలను ద్రవింపజేస్తున్నాయి.
వాస్తవానికి వేమవరం నుంచి పేరేచర్లకు ఆటోలో పది నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఈ పది నిమిషాలే వారికి యమగండమైంది. కాగా, స్కూళ్లలో అడిషనల్ క్లాసులపై నిషేధం ఉన్నప్పటికీ, నిబంధనలను అతిక్రమించిన పాఠశాల అదనపు తరగతులు నిర్వహిస్తోందని తెలుస్తోంది. దీంతో ఈ విషయంలోనూ విచారణ జరిపించి, పాఠశాలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.